గతకొంతకాలంగా విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తన స్థానాన్ని మరింతగా పెంచుకుంటూ దూసుకు పోతున్నారు. ఇటీ వలె విడుదళ అయిన మహర్షి మూవి కూడా సక్సెస్ పుల్గా నడుస్తోంది. తాజాగా మహేష్ను మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రఖ్యాత ‘టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఫరెవర్-2018’ జాబితాలో మహేశ్ బాబుకు స్థానం కల్పించారు. ఈ జాబితాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఇందులో చోటుంటుంది. ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు. గతంలో ఉత్తరాది నుంచి ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ తో పాటు అక్షయ్ కుమార్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మహేశ్ బాబు కూడా వారి సరసన చేరారు. ప్రతిసారి మహేష్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ స్థానంలో వస్తుండటంతో ఆయన పేరును ఫరెవర్ డిజైరబుల్ క్లబ్లో చేర్చేశారు. మహేశ్ ప్రజాదరణ మరింత విస్తరించిందనడానికి టైమ్స్ గుర్తింపే నిదర్శనం.