Saturday, April 27, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన సీఎస్‌, ఇత‌ర ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు

- Advertisement -

ఏపీలో వైసీపీ ‘ఫ్యాన్’ గాలి ప్రభంజనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో వైసీపీ లీడింగ్ లో ఉంది. ఇప్ప‌టికే వైసీపీ 27 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా 126 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక జ‌గ‌న్ సీఎం గా ఖ‌రార‌యిన నేప‌ధ్యంలో ఆయ‌న్ను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిశారు.తాడేపల్లిలోని జగన్ నివాసానికి కొద్ది సేపటి క్రితం ఆయన వెళ్లారు.

జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినట్టు సమాచారం. తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ ని కలిశారు.అయితే వైయస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -