Wednesday, May 1, 2024
- Advertisement -

మహేష్ పిలిచినా, నాకు క్యారెక్టర్ ఉంటుంది కదా: పూరి

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవరు అనే సినిమా తో బిజీ గా ఉన్నారు. అయితే మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ ఇద్దరూ కలిసి పోకిరి, బిజినెస్ మాన్ అనే రెండు సినిమాలు చేసి అభిమానులని ఎంతగానో అలరించిన సంగతి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం అప్పట్లో పూరి జగన్ మహేష్ తో మూడో సారి జతకట్టి జనగణమన అనే సినిమా చేయాలి అని అనుకున్నారట. కాకపోతే ఇప్పుడు అది చేసే ఉదేశ్యం లో లేరట.

తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఒక ఇంటర్వ్యూ లో పూరి జగన్ ని ఈ ప్రశ్న వేయగా, పూరి చెప్పిన సమాధానం అందరికీ షాక్ కి గురి చేసింది. “నన్ను మహేష్ అభిమానులు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు చేస్తారు సినిమా అని. వాళ్ళకి తెలియనిది ఏంటి అంటే మహేష్ నేను హిట్స్ లో ఉంటె నే సినిమా ఇస్తాడు. కనీసం అభిమానులకి అయినా నా మీద ఎంతో కొంత నమ్మకం ఉంది.” అన్నాడు పూరి. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ అయింది కాబట్టి, ఇప్పుడు మహేష్ పిలిస్తే వెళ్తారా అని అడిగితే, “నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఓకే చెప్పడానికి” అని సమాధానం ఇచ్చాడు.

ఇది విన్న చాలా మంది మహేష్ అభిమానుకు ఇప్పుడు ఆగ్రహానికి గురవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -