Monday, May 20, 2024
- Advertisement -

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్….మావోయిస్టులకు ఎదురు దెబ్బ

- Advertisement -

ఛత్తీస్ గఢ్ మరోసారి భారీ ఎన్ కౌంటర్ తో నెత్తురోడింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల అలికిడిపై భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో బలగాలు భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో బలగాల రాకను గమనించిన మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

మరికొందరు మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -