గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఇటీవలే థియేటర్ల లో సందడి చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కష్టపడి సినిమా ని పూర్తి చేసి, చివరి నిమిషం లో టైటిల్ కూడా మార్చారు చిత్ర యూనిట్. మొత్తానికి సినిమా విజయం సాధించింది. విజయోత్సవ సభని కూడా పెట్టారు దర్శక నిర్మాతలు.
“మేము అప్పటికప్పుడు సినిమా టైటిల్ మార్చినా సరే మా సినిమాను ఆదరించి, దానిని ప్రేక్షకుల దగ్గరకు తీసుకొని వెళ్ళిన మీడియా వారికి స్పెషల్ థాంక్స్. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా కోసం నా తో పాటు కష్టపడుతూ నా కోసం పని చేసి నాతో ట్రావెల్ చేసిన మధు శ్రీనివాస్, మిధుల్ చైతన్య గారికి థాంక్స్. ఈ సినిమా లో తమిళ హీరో అధర్వ అద్భుతంగా నటించారు. వరుణ్ ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు. ఆయన ఈ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్న విధానం అందరినీ ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఏ రోజు ప్రొడక్షన్ నుండి ఇది లేదు అనే మాట రాలేదు. అంత లాగా నాకు ప్రొడ్యూసర్స్ సహకరించారు. ఈ రోజు ఆడియన్స్ మా సినిమా ని ఆదరించి పొగుడుతున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా యొక్క ఘాన విజయాన్ని ‘వాల్మీకి మహర్షి’కి అంకితం ఇస్తున్నాను.” అని ఆయన అన్నారు.
ఈ సినిమా కి కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.