Thursday, May 2, 2024
- Advertisement -

కైరా అద్వానీ బోల్డ్ స్టేట్మెంట్

- Advertisement -

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి పేరు తెచ్చుకుంది కైరా అద్వానీ. తరువాత రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో బాలీవుడ్ కి పరిమితం అయింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు… పెళ్లికి ముందు డేటింగ్ చేసినా ఎలాంటి తప్పు లేదంటూ సంచలన ప్రకటన చేసింది. ఇటీవలి కాలంలో సినిమా హీరోయిన్లు బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం బాగా పెరిగింది.

పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పు లేదని… ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే, తాను మాత్రం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని సెలవిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -