ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కండువా మార్చే నాయకులు ఎక్కువైయ్యారు. అయితే ఎన్నికలు సమయంలో పలువురు సినిమా వాళ్లు కూడా తమకు నచ్చిన పార్టీలో చేరుతుంటారు. ఏపీలో అధికారంలోకి వైసీపీ పార్టీ వస్తుందని అన్ని సర్వేలు చెప్పడంతో ఆ పార్టీలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు, నటీ, నటులు కూడా ఆ పార్టీలోకి చేరుతున్నారు.
పోసాని, పృథ్వీ, నాగర్జున, జయసుధ,తనీష్, దాసరి కొడుకు అరుణ్ వంటి వారు వైసీపీలో చేరి పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా మరో నటుడు వైసీపీ కండువా కప్పుకోవాడనికి రెడీ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ మాజీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ,నటుడు శివాజీ రాజా వైసీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 24వ తేదీన వైసీపీ అధినేత జగన్ నర్సాపురం లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ను కలిసి పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో శివాజీ రాజా అధ్యక్షుడుగా పోటీ చేసి నరేశ్ చేతిలో ఓడిపోయారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఏదో ఒక పార్టీలో ఉంటే తప్ప మనుగడ సాగించలేమని భావించే శివాజీ రాజా ఇలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. తమ ప్రత్యర్థి వర్గం వేరే పార్టీలో ఉండటంతోనే ఆయన ఇలా వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అయ్యారని శివాజీ రాజా సన్నిహితులు చెబుతున్నారు.
- Advertisement -
వైసీపీలోకి నటుడు శివాజీ రాజా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -