కైరా అద్వానీ ఈ పేరు మొన్నటి వరకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎవరికి తెలియదు.కాని ఒక్క సినిమాతో ఈ భామ పేరు మార్మోగిపొతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన భరత్ అను నేను సినిమాలో హీరోయిన్గా చేసిన కైరా,మొదటి సినిమాతోనే బ్లాక్బ్లాస్టర్ కొట్టింది.సినిమాలో అమ్మడి పాత్ర తక్కువుగా ఉన్న తన క్యూట్ యాక్షన్తో అందరిని మెప్పించింది.ఇక మొదటి సినిమా రీలిజ్కు ముందే మరో స్టార్ హీరో పక్కన హీరోయిన్గా సెలెక్ట్ అయింది.
రాంచరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్గా కైరాని తీసుకున్నారు.కైరా కూడా తన అందాలను ప్రదర్శించాడానికి రెడీ అంటుంది. భరత్ సినిమాలో గ్లామర్కు పెద్దగా ప్రాధన్యత లేకపోవడంతో వరుస ఫోటో షూట్లతో తనలోని మరో కోణాన్ని బయటకు తీస్తుంది.కైరా అందాలకు టాలీవుడ్ ఫిదా అయినట్లుంది.ఎన్టీఆర్,అల్లు అర్జున్ తమ తరువాత సినిమాలలో కైరాను తీసుకొవాలని నిర్మాతలను పట్టుబడుతున్నట్లు సమాచారం.తమ పక్కన కైరా అయితే ఫ్రేష్ లుక్ ఉంటుందని హీరోలు భావిస్తున్నారు.కైరా కూడా టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టినట్లుంది.
తెలుగులో వరుస సినిమాలు చేయలని అనుకుంటుంది కైరా. తెలుగులో సినిమాలు సెలెక్ట్ చేసుకొవడానికి మహేష్ బాబు భార్య నమ్రత హెల్ప్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కైరా కూడా పారితోషకం బాగానే డిమాండ్ చేస్తుందటా!సినిమాకు కోటి రూపాయిలు తీసుకుంటుదని సమాచారం.మరి ఎంతైనా బాలీవుడ్ హీరోయిన్ కదా!1అంత డిమాండ్ చేయడంలో తప్పులేదని కొందరి అభిప్రాయం.