Friday, April 26, 2024
- Advertisement -

మరో మైలు రాయిని దాటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!

- Advertisement -

నందమూరి నట వారసుడిగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో విభిన్న పాత్రలు చేస్తూ,ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసింది.

ఎన్టీఆర్ నటించే ప్రతి ఒక్క సినిమాకు అభిమానులను పెంచుకుంటూపోతున్నారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్ లో కూడా తారక్ సరికొత్త మైలు రాయిని దాటాడు.సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని తారక్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానుల సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 5 మిలియన్స్ కి చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న తారక్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడంతో తర్వాత సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నారు.

Also read:అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -