శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. మార్చి 4న ఈ సినిమాలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు రాధికా శరత్కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను మరింత స్పెషల్ గా చేయబోతున్నారు. ఈ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు ఓ స్టార్ డైరెక్టర్ గెస్ట్ గా రాబోతున్నారు.
ఫిబ్రవరి 27న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా కీర్తి సురేష్, సాయి పల్లవి రానున్నట్లు సమాచారం. వేదికపై వారు థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేయనున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.