Saturday, April 20, 2024
- Advertisement -

రామ్ తో ఢీ అంటే ఢీ అంటున్న ఆది పినిశెట్టి..!

- Advertisement -

హీరో రామ్ పోతినేని ప్రస్తుతం వరుసగా మాస్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్, రెడ్ తర్వాత రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో మరో మాస్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి. హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ యాక్షన్ మూవీ లో రామ్ తో తలపడే విలన్ కు మంచి స్కోప్ ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో విలన్ రోల్ ను లింగు స్వామి చాలా బలంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ రోల్ చేసేది మొదట మాధవన్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ స్వయంగా మాధవన్ తెలిపాడు. ఆ తర్వాత ఈ సినిమాలో మరో కోలీవుడ్ హీరో ఆర్యను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అది కూడా నిజం కాదని తేలింది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు ఆది పినిశెట్టిని తీసుకున్నట్లు సమాచారం.

Also Read: ఆర్​ఆర్​ఆర్​ మ్యూజిక్​ అరుపులేనా..!

ఆది పినిశెట్టి ఇదివరకే తెలుగులో సరైనోడు, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో విలన్ రోల్ పోషించి మెప్పించాడు. అతడైతే ఈ సినిమాకు విలన్ గా పర్ఫెక్ట్ గా ఉంటాడని భావించి లింగస్వామి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా తోనే హీరోగా అరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి ఆ తర్వాత తెలుగులో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆది పినిశెట్టి రంగస్థలం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

Also Read: బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -