బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి నుంచి తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. అమీర్ ఖాన్ ఆదివారం తన 56వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఆయనకు అందరి నుంచి బర్త్ డే విశేష్ లభించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ.. ఇంతకాలంగా తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
అలాగే, సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీని కోసం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్లి చివరి పోస్ట్ పెట్టారు. దీంతో అమీర్ ఖాన్ అభిమానులు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు. అయితే అభిమానులు ఈ విషయం గురించి చింతించవద్దని తాను ఎల్లప్పుడు అందరికి అందుబాటులో ఉంటానని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు. తన జీవిత విశేషాలు, సినిమా వివరాలు తెలుసుకోవడానికి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అధికారిక సైట్ను సందర్శించవచ్చని తెలిపాడు.
“నా పుట్టిన రోజున మీరు చూపించిన ప్రేమ, అభిమానంతో నా హృదయం నిండిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరో విషయం ఎంటంటే ఇక ఇదే నా చివరి పోస్ట్.. ఇప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను” అంటూ ట్వీట్ చేశాడు.
పసుపు పాలతో ప్రయోజనాలెన్నో !