ఎండాకాలం ప్రారంభమయ్యిందో లేదో.. ఎండలు తీవ్ర స్థాయిలో దంచికొడుతున్నాయి. బయటకు అడుగుపెడితే చాలు.. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. ఈ వేడికి బయటకు వెళ్తే చాలు ఖచ్చితంగా ఏదో ఒక కూల్ డ్రింక్ ను తాగాల్సిందే. అందుకే చాలా మంది జనాలకు అందుబాటులో ఉండే చెరకు రసం, నిమ్మరసం, పుదీనా నీళ్లుు, మజ్జిగలు అమ్ముతుంటారు. వీటికి ఈ సీజన్ లో బలే డిమాండ్ ఉంటుంది.
బయటకు వెళ్లినప్పుడు డీ హైడ్రేషన్ అవ్వకుండా ఈ డ్రింక్స్ ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా చెరుకు రసం మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెరుకు రసం శరీరంలో ఉండే మలినాలను తొలగించి.. ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ చెరుకు రసం తాగితే.. సంతానోత్పత్తికి బూస్టర్ లాగా పనిచేయడంతో పాటుగా.. తల్లులకు పాలు పుష్టిగా వచ్చే అవకాశం ఉంటుందట.
అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఈ చెరుకు రసం ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ వచ్చే కొన్ని రోజుల ముందు నుంచి తాగితే నొప్పి వచ్చే అవకాశం లేదని నిపుణులు వెళ్లడిస్తున్నారు. వీటితో పాటుగా అలసటను, శరీర ఉబ్బరాన్ని తగ్గించడంలో చెరుకు ఔషదంలా పనిచేస్తుందట. అలాగే మూత్రపిండాల సమస్య రాకుండా ఇది ఎంతో ఉపకరిస్తుంది.
అమితాబ్, చిరు కాంభినేషన్ లో మరో మూవీ !
అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్