తెలుగు సినీ పరిశ్రమలో దగ్గుబాటి వంశం కూడా చాలా పెద్దది. స్టూడియోలు, సినీ వ్యాపారంతో ఆ కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. మూవీ మొఘల్గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడుగారు కళామతల్లీ సేవలో మునిగిపోయారు. అత్యధికంగా భారతీయ భాషల్లో సినిమా రూపొందించింది రామానాయుడు గారే. భారత సినీ చరిత్రలో ఆయన నాలుగైదు భాషలు తప్ప అన్ని భాషల్లో ఆయన సినిమాలు తీశారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి ఇక్కడికి రావడంలో చాలా కృషి చేశారు. అంతటి ఘన చరిత్ర ఉన్న వంశం నుంచి మరో వారసుడు వస్తున్నాడు. అయితే ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రామానాయుడిగారి కుమారుడు దగ్గుబాటి సురేశ్. ప్రముఖ నిర్మాత. మంచి మంచి సినిమాలు నిర్మించాడు. అతడి వారసులు రానా, అభిరామ్.
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాలో అభిరామ్ను అనుకున్నారు. కానీ తర్వాత సురేశ్బాబు సుమంత్ అశ్విన్ను తీసుకొచ్చి సినిమా తీశారు. తన కొడుకును ఓ మంచి మాస్ ఎంటర్టైన్ర్ సినిమాతో అరంగేట్రం చేపిద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక అభి ఎంట్రీకి ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. దర్శకుడు, కథ, హీరోయిన్ తదితర ఎంపికలన్నీ పూర్తయ్యాయి. ఇక సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించి సెట్స్పైకి వెళ్లడమే ఆలస్యం.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భానుశంకర్ దర్శకత్వంలో హీరోగా అభిరామ్ను పరిచయం చేయబోతున్నారు. భానుశంకర్ చెప్పిన కథ సురేశ్బాబుతో పాటు రానాకు కూడా నచ్చేసింది. మాళవిక వర్మను హీరోయిన్గా కూడా ఎంపిక చేశారు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిన ఈ సినిమాను ఓ మంచి రోజు చూసి లాంచ్ చేయబోతున్నారు. మొదటి సినిమాకే ఫుల్ లెంగ్త్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తీయాలని దగ్గుబాటి కుటుంబం నిర్ణయం తీసుకుంది.
అభిరామ్ను పరిచయం చేసే ఈ సినిమాను టాలీవుడ్లో భారీస్థాయిలో లాంచ్ చేయాలని నిర్ణయించారు. రామానాయుడు స్టూడియోస్లో జరిగే ఈ ప్రారంభోత్సవానికి చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జునలాంటి హీరోలతో పాటు దాదాపు కుర్రహీరోలంతా హాజరవుతారు. ముహూర్తం ఫిక్స్ చేయడం ఒక్కటే మిగిలింది.