ఈ మద్య కాలంలో కొంత మంది సెలబ్రెటీలను లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్, బాంబు బెదిరింపు కాల్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తితెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్లో కలకలం రేపింది. చెన్నై తిరువాన్మియూరులో ఉన్న ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు. జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో… అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు.
ఇక అజిత్ కెరీర్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం.. ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే అజిత్కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2020లోనూ ఓసారి అజిత్కు ఇలాంటి కొందరు అఖతాయిలు ఇలాగే ఫోన్ చేశారు. పోలీసులు అలర్ట్ అయి అది ఫేక్ కాల్ అని తేల్చారు.
అర్ధరాత్రి పూట చావుబతుకుల్లో ఆదుకున్న హీరో..!
తగ్గేదే లే అంటున్న వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్ ఇలాకాలో పర్యటన
నేను పూర్తిగా వెజిటేరియన్.. కానీ ఆ షాపులో నాపేరా.. సోను సూద్