ఇటీవల కాలంలో టాలీవుడ్లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. యువనటుడు భార్య ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్ గోపినాథ్ అనే నటుడు స్మిరిజ అనే అమ్మాయిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.మూడేళ్లు అవుతున్న పిల్లలు లేకపోవడంతో తరచు వీరిమధ్య గొడవలు జరుగుతుండేవి అని తెలుస్తుంది.లోపం నీలో ఉందంటే నీలో ఉందంటూ ఒకరినొకరు దూషించుకునేవారని సమాచారం. సోమవారం రాత్రి తన భార్యను తీసుకొని హోటల్ వెళ్లి ఇంటికి వచ్చిన సిద్ధార్థ్ మరోసారి భార్యతో గొడవపడ్డాడు.
ఈ గొడవ కాస్త ముదరడంతో స్మిరిజ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందట. సిద్ధార్థ్ హాల్ లోనే పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారు జామున భార్య ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో సిద్ధార్థ్ మధురవాయిల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టగా.. స్మ్రిజ ఫ్యాన్ కి ఉరివేసుకొని విగతజీవిగా కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన మలుపు సినిమాలో కీలక పాత్రలో నటించాడు సిద్ధార్థ్ . ఈ సినిమా తరువాత సిద్ధార్థ్కు వరస ఆఫర్లు వస్తున్నాయి. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడు అతని భార్య ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏం బాలేదని ఇండస్ట్రీలోని కొందరు చర్చించికుంటున్నారు.