తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని కాసిపేట మండలం మల్కపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్పుల బాధలు భరించలేక కొడుకు, కూతురికి విషమిచ్చి దంపతులిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
జంజిరాల రమేశ్ (40), పద్మ (35) దంపతులు ఓ గదిలో, కుమారుడు అక్షయ్ (17), కుమార్తె సౌమ్య (19), మరో గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌమ్య ఇటీవలే అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. ఇంట్లో ఓ లేఖను గుర్తించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రమేష్ లేఖ రాశాడు. కొన్నాళ్ళుగా రమేష్ భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో అప్పులు పెరగడంతో ఇంటిల్లిపాది ఆత్మహత్యచేసకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాసిపేట పోలీసులు తెలిపారు.
‘కార్తికేయ-2’ షూటింగ్ కొత్త కష్టాలు!