ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓ మహిళాతో తెగ కష్టం వచ్చి పడింది. ఆమె చేసే ఆరోపణలు తీవ్రంగా ఉంటున్నాయి. ఏకంగా తెలుగు సినీ పరిశ్రమనే వాడుకొని వదిలేసే మాదిరి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనికి సోషల్ మీడియా, కొన్ని టీవీ చానల్స్ తమ స్వార్థం కోసం ప్రముఖంగా చూపిస్తున్నాయి. ఆమెను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇగో వారిపై ఆరోపణలు చేయి.. వీరిపై చేయి అన్నట్టు మాదిరి చానల్స్, సోషల్ మీడియా తీరు ఉంటోంది.
ఇదే ఉత్సాహంతో ఆమె ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరింది. టాలీవుడ్ ‘క్యాస్టింగ్ కౌచ్’ పెరిగిపోయిందంటూ ఒకప్పటి నటి, ప్రస్తుతం ఫైర్బ్రాండ్గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కేసీఆర్పై పడింది. అయితే తాను చేస్తున్న ఆరోపణలు, ఈ విషయంపై సీఎం కేసీఆర్ కల్పించుకోవాలని కోరుతోంది. ఒకవేళ కేసీఆర్ స్పందించకపోతే ప్రజల ముందు న్యూడ్ (నగ్నం)గా నిలబడతానంటూ మరో సంచలన ప్రకటన చేసింది.
‘‘కేసీఆర్ గారు మీరు మా బాధ అర్థం చేసుకోకపోతే, మీరు ఏ నిరాహార దీక్షనైతే చేసి తెలంగాణ సాధించుకున్నారో.. నేను కూడా దాన్ని చేస్తా. మీరు అప్పటికీ పట్టించుకోకుంటే, అప్పుడు నేను తర్వాత మరో స్టెప్ తీసుకుంటా. పబ్లిక్లో న్యూడ్గా నిలబడతా.. సర్.. ప్లీజ్ విషయం తెలుసుకోండి. మిమ్మల్ని ఎలా కలవాలో నాకు తెలియట్లేదు సార్’’ అంటూ కేసీఆర్ని ఉద్దేశించి శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.ఇన్నాళ్లు టాలీవుడ్ ప్రముఖులపై పడిన శ్రీరెడ్డి ఇప్పుడు కేసీఆర్ను విన్నవించడంతో ఏమవుతుందో చూడాలి.