దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి వరుసగా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి తాకిడికి కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. కరోనా సామాన్యుల నుంచి సెలబ్రెటీల ను ఎవ్వరినీ వదలడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లు కరోనా రక్కసి భారిన పడుతున్నారు. ఇప్పటికే..అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్, రణ్బీర్ కపూర్, మలైకా అరోరా, ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ, మనోజ్ బాజ్పాయ్, దంగల్ నటి పాతిమా సనా షేక్ వంటి వారికి కరోనా పాజిటివ్ అని తేలింది.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కత్రినా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్గా ధృవీకరించారు.
కరోనా ప్రోటోకాల్ ప్రకారం.. సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. త్వరగా కత్రినా కైఫ్ కోలుకోవాలని ఫ్యాన్స్, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.