Friday, May 10, 2024
- Advertisement -

సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట

- Advertisement -

నటన పరంగా రెజీనా కసాండ్రా నటించిన ప్రతి సినిమా లోనూ ఆమెకి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆమె కెరీర్ లో ఒక సూపర్ హిట్ కూడా లేదు. తెలుగు ఇండస్ట్రీకి దూరంగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా కసాండ్రా ఇప్పుడు మళ్లీ తెలుగులో ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఈమె ముఖ్య పాత్ర పోషించింది. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 15వ తేదీన విడుదల కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం రెజినా క్యారెక్టర్ ఈ సినిమాలోనే హైలైట్ గా మారుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుందని రెజీనా రోల్ చాలా సీరియస్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథ మొత్తం నవీన్ చంద్ర హత్యకు గురవడం చుట్టూ తిరుగుతుందని సమాచారం. రెజీనా ఈ హత్య నిజంగా చేసిందా లేదా అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అర్థమవుతోంది. ఈ సినిమాతో రెజీనా కచ్చితంగా హిట్ అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పీవీపీ సినిమా బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -