టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడవి శేష్. చేసింది కొద్ది సినిమాలే అయినా హీరోగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గుఢాచారి సినిమాతో ట్రెండ్ సెట్టర్గా మారిన అడవి శేష్ తన నెక్ట్స్ ప్రాజెక్టు G2(గుఢాచారి 2) షూటింగ్ ప్రారంభం అయింది. ఇక ఈ సినిమా ప్రారంభమై 24 గంటల గడవక ముందే ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్ అందించారు.
అడివి శేష్ – శృతి హాసన్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ రానుంది. ఈ సినిమాతో షానేయిల్ డియో దర్శకుడి పరిచయం కానుండగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. మేజర్ చిత్రం తర్వాత అడివి శేష్ మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు.
మొత్తంగా ఈ రెండు సంవత్సరాలు అడవి శేష్ కెరీర్లో కీలకం కానున్నాయి. ఎందుకంటే ప్రతి సినిమా కథ విన్నాకే ప్రకటన బయటికి వచ్చేలా చూసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.