అడివి శేష్ మరియు రెజీనా కాసాండ్రా జంటగా నటించిన చిత్రం ఎవరు. ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతుంది. ఈ మధ్యలో ఎన్నో సినిమాలు విడుదల అయినా కానీ ఈ సినిమా మాత్రం మంచి వసూళ్ల తో ముందుకు సాగుతుంది. ఇదే కొనసాగితే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుంది అనడం లో ఏం సందేహం లేదు. ఇప్పటికే శేష్ కెరీర్ లో ఈ సినిమా ఒక పెద్ద మైలురాయి గా మిగిలింది అని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా దాదాపు గా అన్ని ఏరియా ల్లో మంచి వసూళ్ళు రాబడుతుంది. ఈ సినిమా లో రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమా లో మరొక ముఖ్య పాత్ర లో నవీన్ చంద్ర నటించాడు. రామ్ జీ ఈ సినిమా కి దర్శకుడు గా వ్యవహరించారు. ఇదే ఆయనకీ మొదటి సినిమా. పీ వీ పీ ఈ సినిమా ని నిర్మించారు. శేష్ ఇప్పటికే గూఢచారి కలెక్షన్స్ ని కూడా అధిగమించి మంచి విజయం సాధించానని ఇప్పటికే ప్రకటించాడు కూడా.
ఇక చిన్న చిత్రాల విషయం లో ఎవరు, ఎవరికీ అందని విజయమే అంటున్నారు దర్శక నిర్మాతలు.