Friday, May 17, 2024
- Advertisement -

బాలయ్య,నాని తర్వాత అనుష్కానే

- Advertisement -

ఏ హీరో అయినా సరే….తాను చేసిన సినిమాలను ఒక ఆర్డర్ లో రిలీజ్ చేస్తూ ఉంటాడు. తెలిసి తెలిసి ఏ కథానాయకుడు తాను చేసిన చిత్రాలను ఒకే రోజు రిలీజ్ చేయడు.

చరిత్రలో ఇలాంటి ఘట్టాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.చరిత్రనే తిరగరాస్తాడనే పేరున్న బాలయ్య వల్ల మాత్రమే ఇలాంటివి సాధ్యమౌతుంటాయి.  మరి ఆ రోజుల్లో బాలయ్య బాబు నిప్పు రవ్వ,బంగారు బుల్లోడు లాంటి రెండు చిత్రాలను ఒకే రోజు రిలీజ్ చేశాడు. వీటిలో బంగారు బుల్లోడు ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది.

నిప్పు రవ్వలో విషయమున్నా…ఎందుకనో వెలగలేదు. ఆ తరువాత మన నానిబాబు ఎవడే సుబ్రహ్మణ్యం, జెండా పై కపిరాజు నంటూ రెండు చిత్రాలతో యాక్సిడెంటల్ గా ఊడి పడ్డాడు. వీటిలో సుబ్రహ్మాన్యాన్ని పాస్ చేసి కపిరాజుకు కపిల తీర్దం ఇచ్చేశాడు.

చరిత్రలో ఇలా….ఇక ఇద్దరే అనుకుంటోన్న ఈ టైమ్లో….. అందాల భామ అనుష్క వీరితో పాటు నేను కూడా అంటూ…. మన ముందు కొచ్చేస్తోంది. సైజ్ జీరో చూపిస్తూనే రుద్రమదేవిగా అక్టోబర్ 9 న మన ముందుకురెండు రకాలుగా రావడానికి రెఢీ అయిపోతోంది.  టాలీవుడ్ చరిత్రలో ఏ హీరో హీరోయిన్లు  ఇప్పటి వరకూ …ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ చేసి సక్సెస్ కొట్టిన దాఖాలాలు లేవు.మరి  ఆ ట్రాక్ ను  ఇప్పుడు అనుష్క బ్రేక్ చేస్తుందనుకోవాలా…? లేక ఏం చేయలేక ఒక బాలయ్య, ఒక నాని ఆ తర్వాత ఒక అనుష్క అని చరిత్రలో నిలిచిపోతుందా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -