Thursday, May 2, 2024
- Advertisement -

మరో మనం చేస్తున్న నాగార్జున

- Advertisement -

అక్కినేని కుటుంబానికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చిన చిత్రం మనం. అక్కినేని నాగేశ్వర రావు చివరి చిత్రం గా ఇది మన ముందుకు వచ్చినా, ఇందులో అక్కినేని కుటుంబం లో ని నటీ నటులు అందరూ నటించారు. అఖిల్ కూడా తన మొదటి చిత్రానికి ముందే ఈ సినిమా లో మెరిశాడు. ఇకపోతే అంతా అనుకున్న విధంగా నే ఈ సినిమా విడుదల కాగానే పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా తో డబ్బు, పేరు రెండూ రావడం తో నాగార్జున కూడా తన తండ్రికి మంచి ట్రిబ్యూట్ ఇచ్చాను అని సంతోషం గా ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం నాగార్జున బంగార్రాజు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా మనం లాగానే అక్కినేని నటుల తో నిండిపోతుంది అనే టాక్ నడుస్తుంది. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర చేస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమా లో నాగ చైతన్య, సమంత ల జంట ని కూడా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. అది పక్కన పెడితే కొన్ని అతిధి పాత్రలకి అమల ని, అఖిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రాన్ని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -