తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ రానుంది. దీనికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక రిబ్బన్ కట్ ఆలస్యమే. అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. వీరిద్దరి సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. నాగార్జున, నాని కలసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గోవిందా గోవిందా, రావోయి చందమామ, ఆజాద్ వంటి సినిమాలు వైజయంతి సినిమాలు నాగ్ చేశారు. చాన్నాళ్ల తరువాత మళ్లీ నాగార్జున ఆ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అయితే రాజుగారి గది-2లో ఆకట్టుకున్న నాగార్జున వర్మ దర్శకత్వంలో శివ సినిమాకు సీక్వెల్ను తీస్తున్నారు. ఇక నాని తన ఎంసీఏ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత మరో డ్యుయల్ రోల్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత నాగ్తో కలిసి నాని నటించనున్నాడు. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాను ప్రారంభిస్తారు.