ప్రసిద్ఙి చెందిన జిక్యూ ఇండియా దేశంలోని పలు రంగాల్లో ఎంతో ప్రభావవంతులైన 25 మందిని తమ జాబితాలో పేర్కొంది. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఉండటం గమనార్హం. ఈ జాబితాలో పాపులర్ కమెడియన్ డానిష్ సైట్ ఉన్నారు. అలాగే నటి అనుష్క శర్మ కూడా ఉంది.
ఇక క్రికెటర్ల విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మార్పుకు శ్రీకారం చుట్టే వ్యక్తులు అంటూ ట్యాగ్ చేసింది జిక్యూ ఇండియా. ఇందులో ఎంతో మంది ఇన్నోవేటర్లు, ఎంటర్ టైనర్స్, డిస్ట్రప్టర్స్, గేమ్ ఛేంజర్స్ జాబితాలో వారి పేర్లను చేర్చింది. ఇందులో అల్లు అర్జున్ పేరు ఉండటంతో తన ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు.
భాష ప్రమేయం లేకుండా తన యాక్టింగ్ తో మంచి స్టార్డమ్ సంపాధించిన వ్యక్తి ఈ యువ హీరో. ఇండియలో అత్యంత ప్రభావవంతమైన 25 మందిలో అల్లు అర్జున్న నిలవడం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు నేటికీ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన స్టార్డమ్ అండ్ పాపులారిటీ.. !
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మహానటి !