ఇప్పటికే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి రెండు సూపర్ హిట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. విడుదల కి ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాలో టబు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ సినిమాలో టబు ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ తదితరులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా ఈ సినిమాకి ‘అలా వైకుంఠపురంలో’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక వీడియో ను సైతం విడుదల చేసింది. అందులో గ్యాప్ ఎందుకొచ్చింది అని మురళి శర్మ అడగగా, “ఇవ్వలేదు.. వచ్చింది” అంటూ బన్నీ చెప్తాడు. గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.