Saturday, April 27, 2024
- Advertisement -

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల పాన్ ఇండియా సినిమాపై అందరి దృష్టి

- Advertisement -

టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి అల్లు అర్జున్ పుష్ప 2. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ హైప్ ఉంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ పై చాలా ఊహాగానాలు వచ్చాయి చివరికి త్రివిక్రమ్ తో ఫైనల్ అయింది. #AA22 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా అలా వైకుంఠపురం తో పాటు జులాయి, S/o సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలను అందించారు. మరోసారి వీరి కలయిక పై అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం తెరకెక్కుతుంది. ఈ సినిమా మొదటి నుండి వాయిదా పడుతూ, మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది.

ఇప్పటికే పాన్-ఇండియా స్టార్‍గా అల్లు అర్జున్‍కి గుర్తింపుఉంది. అయితే త్రివిక్రమ్‌కి ఇది మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్. త్రివిక్రమ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలేవీ చేయలేదు. ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటు నుంచి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న నాలుగో సినిమాపై అందరి దృష్టి పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -