నా పేరు సూర్య……నా ఇళ్ళు ఇండియా సినిమా రిలీజ్కి ముందు వరకూ నానా హంగామా చేసింది. అల్లు అర్జున్ మేకోవర్ స్టిల్స్ అయితే ఆకట్టుకున్నాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అంతా చప్పబడిపోయింది. గతంలో వచ్చిన యావరేజ్ సినిమాల కలెక్షన్స్ని కూడా ఓ మోస్తరు రేంజ్కి తీసుకెళ్ళిన బన్నీ ఈ సారి మాత్రం రిలీజ్ రోజు సాయంత్రం షోల నుంచే పూర్తిగా చతికిలపడ్డాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ లేచింది లేదు. అయినప్పటికీ ఏదో ఒకటి చేద్దాం……కనీసం పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూపించి అయినా కాస్త కలెక్షన్స్ పెంచుకుందాం అని ఆలోచించిన బన్నీ అండ్ కో థ్యాంక్యూ మీట్ అరేంజ్ చేశారు.
అయితే ఆ థ్యాంక్యూ ఇండియా మీట్తో సినిమా సూపర్ హిట్ అని ప్రచారం చేయాలనుకున్న నా పేరు ఇండియా టీం పరోక్షంగా సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసింది. ముఖ్య అథిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా పక్కనే జరుగుతున్న నేల టికెట్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి కేవలం అరగంట మాత్రమే ఉన్నాడు. రెండే రెండు నిమిషాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్…….తాను అసలు సినిమాని చూడనే లేదని…..త్వరలో చూస్తానని చెప్పాడు. రంగస్థలం సినిమా సక్సెస్ మీట్లోొ అరగంట సేపు మాట్లాడిన పవన్ ఈ సారి మాత్రం కేవలం రెండు నిమిషాల్లో ముగించాడు. ఇక నా పేరు సూర్య హీరో అల్లు అర్జున్ కూడా కేవలం రెండు నిమిషాల్లో తన ప్రసంగం ముగించాడు. అన్నింటికీ మించి ఒక్కరి మొహంలో కూడా సక్సెస్ కళ లేకుండాపోయింది. అలాగే ఫంక్షన్ మొత్తం కూడా అరగంటలో అయిపోవడం గమనార్హం. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటేనే చాలు…….ఆడిటోరియం మొత్తం నిండిపోవడం, దద్దరిల్లిపోవడం రివాజు……..కానీ ఈ సారి మాత్రం పవన్ అభిమానుల హంగామా కూడా ఏమీలేదు……..కనీసం థియేటర్ కూడా నిండిపోలేదు……….మొత్తం సక్సెస్ మీట్ అయిపోయాక ఈ మీట్తో సినిమా సూపర్ హిట్ అని చెప్పినట్టా? లేకపోతే సినిమా ఫ్లాప్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్టా అన్న సందేహాలు ఆడిటోరియంలోనే వినిపించడం గమనార్హం.