అల్లు వారాబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అల్లు శిరీష్.అటు మెగా ఫ్యామిలీ,ఇటు అల్లు వారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కావడంతో శిరీష్కు ఇండస్ట్రీలో తిరుగులేదని భావించారు చాలమంది.తీర చూస్తే సీన్ రివర్స్ అయింది.అల్లు శిరీష్ అనుకున్నంత హిట్ కాలేదు.తీసిన రెండు సినిమాలు ఫెయిల్ కావడంలో అల్లు శిరీష్ను పట్టించుకున్న వారు లేరు.అయితే తాజాగా అల్లు శిరీష్ చేసిన పనితో వార్తల్లో నిలిచాడు. అన్నయ్య బన్నీ తనకు ఓ ల్యాప్ ట్యాప్ని కొనిచ్చిన సంగతిని ట్వీట్టర్లో పోస్ట్ చేశాడు శిరీష్. తన పట్ల అన్నకు గల ప్రేమానురాగాలకు అల్లు శిరీష్ పొంగిపోయాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా గిఫ్టులు ఇచ్చాడు. అలా యాపిల్ మాక్ ల్యాప్ టాప్ ఇచ్చిన అన్నయ్యకి ధన్యవాదాలు అంటూ స్పందించాడు.
అల్లు శిరీష్ చేసిన ట్వీట్కు ఓ అభిమాని స్పందిస్తూ… “అన్నా నాకు ఒక చిన్న ల్యాప్ టాప్ ఇవ్వొచ్చు కదా .. నేను కొనాలంటే ఓ మూడేళ్లు పడుతుంది. నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ .. జీతం తక్కువ. నాకు ల్యాప్ టాప్ చాలా అవసరం .. కానీ ఇంతవరకూ కొనుక్కోలేకపోయాను” అంటూ రాసుకొచ్చాడు. దీనిపై వెంటనే స్పందించాడు అల్లు శిరీష్.’నువ్వేం బాధపడకు తమ్ముడు .. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది గనుక, నా దగ్గరున్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను .. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయి’ అంటూ సమాధానమిచ్చాడు. అల్లు శిరీష్ చేసిన పనిని అందరు ప్రశంసిస్తున్నారు.శిరీష్ మనస్సు ఇంత మంచిదా అంటూ.. నెటిజన్లు అతనినిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.