మొన్న అమలాపాల్ బొడ్డు చుట్టూ వ్యవహారమంతా తిరిగింది. ఓ సినిమాలో ఆమె బొడ్డు విప్పుకొని ఎక్స్పోజింగ్ చేస్తుంటే వివాదాస్పదమైంది. ఆ వివాదంపై అమలాపాల్ కూడా స్పందించి సినిమాల కోసం ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేసి అందరీతో ప్రశంసలు అందుకుంటోంది.
ఇటీవల ‘మైనా’ సినిమాతో అమలాపాల్ వివాదాస్పదంగా నిలిచినా ఒక మంచి కార్యక్రమంతో అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది. అమలాపాల్ ఆమె తన కళ్లను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో కళ్లను దానం చేస్తున్నట్టు సంతకం కూడా చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కళ్లు లేని వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కళ్ల దానంపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు తాను ముందుకు వస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు చైతన్యవంతులై నేత్ర దానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని కోరింది.