గుజరాత్లో అమలాపాల్ సీమంతం ఘనంగా జరిగింది. గతేడాది నవంబర్లో జగత్ దేశాయ్ని రెండో పెళ్లి చేసుకుంది అమలాపాల్. ఇక తాజాగా సాంప్రదాయ పద్దతిలో అమలా పాల్కు సీమంతం వేడుక చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అమలాపాల్. ఈ ఫోటోలో తన భర్త జగత్ దేశాయ్ తో కలిసి ఉన్న ఫోటో వైరల్గా మారింది. ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక అంటూ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చింది.
అమలాపాల్ రీసెంట్గా నటించిన ఆడుజీవితం ప్రేక్షకాదరణ పొందింది. పెళ్లి తర్వాత బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకున్న అమలా..అందరి అటెన్షన్ను తనవైపుకు తిప్పుకుంది. అలాగే అమలాపాల్ బీచ్ లు, దేవాలయాలు, పబ్లిక్ ఈవెంట్స్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అబిమానులతో పంచుకుంటూనే ఉంది.
పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. 2023 నవంబర్లో కోచిలో జగత్ను వివాహం చేసుకుంది అమలా.