Friday, April 19, 2024
- Advertisement -

రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ దర్శకుడు

- Advertisement -

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘మద్రాసిపట్నం’, ‘శైవం’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఎల్ విజయ్ తెలుగులో తను దర్శకత్వం వహించిన ‘అభినేత్రి’, ‘కణం’ వంటి సినిమాలు తెలుగులో కూడా విడుదల చేశారు. 2014లో ఏ ఎల్ విజయ్ ప్రముఖ నటి అమలాపాల్ ను పెళ్లాడాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2017 లో విడిపోయారు. అప్పటి నుంచి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన విజయ్ ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే నెల 11 వ తారీకు తేదీన ఏ ఎల్ విజయ్ ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. రాజన్ బాబు, అనిత ల కుమార్తె ఐశ్వర్య ను ఎల్ విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరి పెళ్లి అరేంజ్మెంట్ లలో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల పరంగా దర్శకత్వం వహించిన ‘అభినేత్రి 2’ ఈ మధ్యనే విడుదలైంది. ప్రస్తుతం కంగనా రనౌత్ హీరోయిన్ గా జయలలిత బయోపిక్ అయిన ‘తలైవి’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఏ ఎల్ విజయ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -