Thursday, May 2, 2024
- Advertisement -

నాగార్జున తో పోటీ ఏంటి అంటున్న హాట్ యాంకర్

- Advertisement -

ఒకవైపు టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా మరో వైపు వెండితెరపై కూడా మంచి పాత్రల్లో కనిపిస్తున్న హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు ముఖ్య పాత్రలో ‘కథనం’ అనే సినిమాలో నటిస్తోంది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పెళ్లి పృద్వి, సమీర్, రామరాజు, జ్యోతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. అయితే అదే రోజున నాగార్జున మరియు రకుల్ ప్రీత్ నటించిన ‘మన్మధుడు 2’ సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.

ఈ నేపథ్యంలో అనసూయ ‘కథనం’ సినిమా నాగార్జున మన్మధుడు సినిమా కి గట్టి పోటి ఇస్తుందంటూ కొందరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దీంతో సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది అనసూయ. “అసలు నాగార్జున గారికి నేను పోటీ ఏంటి పిచ్చి కాకపోతే.. ‘మన్మధుడు 2’ ట్రైలర్ చాలా చాలా బాగుంది. నాగార్జున గారు, రకుల్ ప్రీత్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ వీళ్ళంతా నాకు మంచి స్నేహితులు. నా ‘కథనం’ సినిమాతో పాటు ‘మన్మధుడు 2’ సినిమా కూడా కచ్చితంగా అదేరోజు చూస్తాను” అని పోస్ట్ చేసింది అనసూయ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -