Sunday, May 5, 2024
- Advertisement -

లాక్‌డౌన్‌లో బుల్లితెర నటులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ విధించడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు. ఇక సెలబ్రిటీలకు సైతం షూటింగ్లు లేకపోవడంతో ఇంటికే పరిమితమై వారి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటులు ఇంట్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం…

బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై,వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక లాక్ డౌన్ సమయంలో అనసూయ తన కుటుంబంతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన పిల్లలు తన ఇంట్లో ఉన్న పెట్ లతో ట్రైనింగ్ ఇస్తుండగా.. అనసూయ ఇట్స్ ట్రైనింగ్ టైం అంటూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ అరియాన కొత్త ఇంటికి మారి సర్దే పనిలో బిజీగా ఉన్నారు.

Also read:నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

బుల్లితెర యాంకర్ గా ప్రస్థానం కొనసాగించిన శిల్ప చక్రవర్తి ఈ సమయంలో తన ఇంటిని శుభ్రం చేస్తున్న టువంటి వీడియోను అభిమానులతో పంచుకున్నారు. బుల్లితెర నటిగా, కమెడియన్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న రోహిణి ఈ సమయంలో ఇండోర్ గేమ్స్ ఆడుతూ, శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. బుల్లితెర క్యూట్ కపుల్ గా ఎంతోమందిని ఆకట్టుకున్న సిద్ధార్థ వర్మ, విష్ణు ప్రియ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో దాగుడు మూతలు ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

Also read:అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -