Tuesday, May 14, 2024
- Advertisement -

ఇక హీరోయిన్ పాత్రలకు అనసూయ గుడ్ బై చెప్పాల్సిందేనా

- Advertisement -

ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎదిగిన అనసూయ భరద్వాజ్ ‘క్షణం’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ఒక నటిగా కూడా మారిపోయింది. ఆ తరువాత ‘రంగస్థలం’, ‘యాత్ర’ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించిన ఈమె ‘కథనం’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. సినిమా మొదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా ట్రైలర్ తోనే సినిమాపై బజ్ పడిపోయింది. మరోవైపు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ప్రమోషన్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో సినిమాకి ఆశించిన విధంగా మంచి ఓపెనింగ్స్ కూడా లభించలేదు.

ఈ మధ్యనే విడుదలైన ‘కథనం’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వల్ల నిర్మాతలకి రెండు కోట్ల దాకా నష్టం వచ్చిందని సమాచారం. మరోవైపు అనసూయ చేతిలో ఉన్న ‘సచ్చింది గొర్రే’ సినిమా కూడా ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు అనసూయ చేతిలో విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఒక సినిమా తప్ప మరేమీ లేదు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక అనసూయ హీరోయిన్ పాత్రలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే సెటిల్ అవ్వాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -