Tuesday, April 30, 2024
- Advertisement -

వ‌ర్మ‌తో అఫైర్ అంటగట్టారు

- Advertisement -

యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ ఓ వెలుగు వెలుగుతుంది.యాంక‌ర్‌ల‌లో అన‌సూయ‌కు ఉన్నా క్రేజ్ మ‌రో యాంక‌ర్‌కు లేదంటే అర్థం చేసుకొవాలి ఆమె ఎంత‌లా దూసుకుపోతుందో. అడ‌పాద‌డ‌పా సినిమాల‌ను కూడా చేస్తుంది అన‌సూయ‌.ఇటీవ‌లే ఆమె న‌టించిన‌ “రంగస్థలం”లో అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌కి మంచి పేరు వ‌చ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ షోలలో యాంకర్‌గా పని చేసి, ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టినట్టు వివరించింది.

అయితే, మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలసి పని చేశానని ఆ స‌మ‌యంలో ఆయనతో తనకు అపైర్ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.ఆ సమయంలో తాను గర్భవతినని ఆ వార్త‌ల‌తో త‌ను చాలా బాదపడ్డాను అని చెప్పుకొచ్చింది.అయితే త‌న‌కు త‌న భ‌ర్త ఆ స‌మ‌యంలో అండ‌గా నిల‌బ‌డ్డార‌ని త‌న‌ని నమ్మి మళ్లీ సినిమా ఇండ‌స్ట్రీకి పంపించారు అని ఎవ‌రు న‌మ్మిన న‌మ్మ‌క‌పొయిన త‌న భ‌ర్త త‌న‌ను నమ్మితే చాలని త‌న‌లోని భాద‌ని చెప్పుకొచ్చింది.తన కుటుంబసభ్యులు తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే నా కెరీర్ ఇంత సాఫీగా సాగుతోందని చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -