Thursday, May 2, 2024
- Advertisement -

యాంక‌ర్ శ్రీముఖికి వేధింపులు

- Advertisement -

ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ప‌లు టీవీ షోల‌కి యాంక‌రింగ్ చేస్తుంది శ్రీముఖి. ఎప్పుడు హుషారుగా ఉంటూ, అంద‌రిని అల‌రిస్తుంటుంది. సినిమాల‌లో కూడా ట్రై చేసింది కాని , ల‌క్ క‌లిసి రాలేదు. దీంతో కేవ‌లం బుల్లితెర‌కే పరిమితం అయింది శ్రీముఖి. ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని, త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్ట్ చేసింది శ్రీముఖి. మనుషులు గురించి మాన‌వత్వం గురించి మాట్లాడింది.స‌మాజంలో మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంద‌ని,డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నారని శ్రీముఖి చాలా బాధ పడిపోయింది.

మానవ‌త్వం మర్చిపోయావా అంటూ గతంలో న‌న్ను చాలామంది ప్ర‌శ్నించార‌ని,కాని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎవ్వ‌రికి మాన‌వత్వం అనేది లేద‌ని తెలిపింది. ఈ స‌మాజంలో జీవిస్తున్నాం అంటే దానికి డ‌బ్బే కార‌ణం అనిపిస్తుంది. మాన‌వ‌త్వం చ‌చ్చే లోపు ఈ ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తాను” అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది శ్రీముఖి. ఇంత‌కి ఏం జ‌రిగిందో తెలియ‌దు కాని,ఎవ‌రో ఆమెని ఇబ్బంది పెట్టార‌ని మాత్రం తెలుస్తుంది.శ్రీముఖిని ఎవ‌రు ఇబ్బంది పెట్టార‌ని అభిమానులు అడుగుతున్న ఆమె మాత్రం సమాధానం చెప్పడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -