ఇప్పటికే ఇద్దరు మెగాహీరోలతో నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి అంగీకరించింది. సంక్రాంతికి వచ్చిన పవన్కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో మెరిసిన అను ఆ తర్వాత అల్లు అర్జున్తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు మెగా అల్లుడు సాయిధరమ్ తేజతో నటించడానికి రెడీ అయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలతో నటించే అవకాశం అను తొందర్లోనే దొరికేసింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నటించడానికి అను పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. దీంతో ఆమెనే ఫైనల్ చేద్దామని ఫిక్సయ్యారట. అయితే దీనిపై గుసగుసలు వస్తూనే ఇంకో హాట్ టాపిక్ కూడా వినిపిస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో రామ్చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమా తీస్తోంది తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్చరణ్కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ను ఎంపిక చేస్తారని ఆసక్తికరమైన వార్త నడుస్తోంది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు.
https://www.youtube.com/watch?v=ulGYc7iTSME