Wednesday, May 8, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న అరణ్య ట్రైలర్…!

- Advertisement -

టాలీవుడ్ హీరో దగ్గుబాటి వారసుడు రానా నటిస్తున్న సినిమా “అరణ్య”.25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథతో వస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పిల్గావోంకర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్‌ దర్శకుడు.ఇక ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజైంది. దీనికి విక్టరీ వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. ఇక సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది…ఇక ట్రైలర్ లో మనం గమనించినట్లయితే అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించేలా కనిపిస్తోంది.ఇది రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌. మనుషులెవరూ లోనికి రాకూడదు అని చెప్తున్నారు. కానీ రానా సహా మరికొందరు ఆ అడవిలోనే ఏనుగులతో సహవాసం చేస్తున్నారు.

గజరాజులతో దోస్తీ చేస్తున్నారు. కానీ ఓ అటవీశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన ఓ వ్యక్తి ఆ అడవి చుట్టూ గోడ కట్టిస్తాడు.దీంతో ఏనుగులు నీటి కోసం వెళ్లే దారి మూసుకుపోతుంది.గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్కుండా పోవడంతో రానా ఆ గోడను ధ్వంసం చేసి ఏనుగులను కాపాడేందుకు పోరాడతాడు.అలుపెరగకుండా పోరాటం చేస్తున్న రానాను ఇంటర్వ్యూ అడుగుతుందో అమ్మాయి.

దీంతో విసుగెత్తిపోయిన రానా ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. ఈ హెడ్‌లైన్‌ పెట్టే దమ్ముందా? అని అడుగుతాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌లో రానా నటన అద్భుతంగా ఉంది. ఎంతో ఆసక్తికరంగా చాలా కొత్తగా ఉండి ఎంతగానో ఆకట్టుకుంటుంది…ఇక ఈ ట్రైలర్ భారీ అంచనాలను పెంచేస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో రానా హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు…. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -