మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ’ఆచార్య’. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినమా కరోనా కారణంగా ఆగిపోయింది. చిరుకు దర్శకుడు కొరటాల శివ కథ చెప్పేటప్పుడే సినిమాలో ఒక కీలక పాత్ర గురించి చెప్పాడట. చిరంజీవి కథ ఓకే చేయడానికి ఈ పాత్ర కూడా ఒక కారణమని తెలుస్తోంది.
సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం మీద చాలా రకాల వార్తలు వచ్చాయి. మహేష్ కి ఈ పాత్ర నచ్చి ఓకే చేసినట్లు వార్త వచ్చింది. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు మహేష్ ఆచార్య సినిమాలో నటించడం లేదని తేలుస్తుంది. ఆ పాత్ర కోసం ఇప్పుడు రామ్ చరణ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాకుండా ఒక సాంగ్ లో చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటిస్తారంట.
అయితే ఆచార్య సినిమాలో విలన్ గా ఎవరు అన్నది ఇంతవరకు చిత్ర యూనిట్ చెప్పలేదు. తాజాగా చిత్ర బృదం రామ్ చరణ్ విలన్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. సినిమాలో విలన్ పాత్రకు రామ్ చరణ్ ధృవ సినిమా లో విలన్.. తమిళ హీరో అరవింద్ స్వామి కరెక్ట్ గా సెట్ అవుతాడు అని దర్శకుడు కొరటాల శివ బావిస్తున్నట్లు సమాచారం.. ఇదే విషయం రామ్ చరణ్ కూడా చేప్పాడట. ఇక ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తేలిసిందే..!
ఆచార్యలో రామ్ చరణ్ పోషించే పాత్ర ఇదే.. ?
‘ఆచార్య’లో మూవీలో మహేష్ లేడట.. ఎందుకంటే ?