- Advertisement -
అవతార్. గుర్తుందిగా. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్రం. ఈ చిత్రానికి సీక్వెల్ గా ముందు రెండు భాగాలు అనుకున్నారు. ఆ తర్వాత అది మూడో భాగానికి మారింది. ఇప్పుడు కథ పరంగా నాలుగు భాగాలు తీయాల్సిన అవసరం వచ్చిందని అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రకటించారు.
నాలుగో భాగాన్ని తెరకెక్కించాల్సి వస్తోంది. దీని కోసం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందని కెమెరూన్ చెప్పారు. అవతార్ రెండో భాగం 2018లో విడుదల చేస్తామని, 2020లో మూడో భాగం, 2022లో నాలుగో భాగం, 2023 సంవత్సరంలో నాలుగో భాగం విడుదలవుతాయని కెమెరూన్ ప్రకటించారు. ఈ నాలుగు భాగాలు ప్రపంచ సినీ చరిత్రలో చిరస్ధాయిగా మిగిలిపోతాయని ఆయన అన్నారు.