- Advertisement -
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపొయింది. ఇక తన తరువాత వచ్చే సినిమాలు కూడా ఇదే విధాంగా ఉండాలని ప్రభాస్ కోరుకుంటున్నాడు. అందుకే సాహో సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో తీస్తున్నాడు. అయితే ప్రభాస్ ఓ బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పాడని తెలుస్తోంది. ప్రభాస్తో సినిమా తీయాలని ముందుకొచ్చాడు కరణ్ జోహర్. ప్రభాస్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు వినిపించాయి.
కాని అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్తో బిజిగా ఉన్నాడు. ఆ తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గాని మరో సినిమా అంగీకరించ కూడదని భావిస్తున్నాడు ప్రభాస్.