అత్యంత ప్రతిష్టాత్మకంగా గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి బాహుబళి సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా బాహుబళి టీమ్ థీమ్ పార్టీ వినూత్నంగా నిర్వహించింది.
ఈ పార్టీకి చిత్ర సమర్పకుడు కె.రాఘవేంద్ర రావు ఇల్లు వేదికగా చేసుకున్నారు. బాహుబళి టీమ్ మొత్తం రాఘవేంద్ర రావుతో సహా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణలో వచ్చి అందర్ని ఆకర్షించారు. కానీ ఈ చిత్రానికి సంబందించిన ఇద్దరు కీలక వ్యక్తులు హాజరు కాకపోవడం విశేషం. ఆ ఇద్దరు వ్యక్తులు బాహుబళి సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళి కథానాయకుడు ప్రభాస్.
వీళ్ళిద్దరూ మినహా రానా, అనుష్క, శోభు యార్లగడ్డ, రాఘవేంద్రరావు, హీరో నాని, సినిమా యూనిట్ సభ్యులు అందరూ కలిసి ఈ థీమ్ పార్టీలో విచిత్ర వేషధారణలో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ పార్టీలో రాజమౌళి, ప్రభాస్ ఎందుకు పాల్గొనలేదు అని ఫిల్మ వగర్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
సంచలనాత్మకంగా రూపొందించిన సినిమా ప్రమోషన్కు వీళ్ళిద్దరూ లేకపోవడం వెనుక కారణం ఏదై ఉంటుందో అని అందరిలోనూ చర్చ. ఏది ఎమైనా వీరిద్దరూ తప్ప మిగతా అందరూ బాగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.
ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ బాహబళి సినిమా పని మీదనే ఉన్నారని సమాచారం.