కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ తనయులు అయిన హరికృష్ణ-బాలకృష్ణల విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.హరికృష్ణ కొడుకులు అయిన ఎన్టీఆర్,కల్యాణ్ రామ్లతో కూడా బాలకృష్ణ మాటాలు లేవని తెలుస్తుంది.బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలుస్తుందే.అయితే ఈ బయోపిక్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరు నటిస్తున్నారు,కాని ఈ సినిమాలో ఎన్టీఆర్,కల్యాణ్ రామ్లను మాత్రం తీసుకోలేదు బాలకృష్ణ.అయితే హరికృష్ణ మరణంతో విషాదంతో నిండిపోయింది ఆయన కుటుంబం.మరి హరికృష్ణ మరణంతో అయిన బాలకృష్ణ వారి కొడుకులతో కలిసిపోతారా అనే అనుమానం అందరిలోను ఉంది.
తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు ఈ సమయంలో బాలకృష్ణ తండ్రిలా అండగా ఉండి – వారిని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఆ భాద్యత తీసుకుంటాడా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్న మరణంతో బాలకృష్ణ తన అన్న కొడుకులకు అండగా ధైర్యంగా నిలబడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.హరికృష్ణ అంత్యక్రియలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో ఆ విభేదాలు కూడా తొలగినట్లే అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి బాలకృష్ణ మనస్సులో ఏం ఉందో ఎవరికి తెలుసు.