తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల తరువాత అందరు కళ్లు ఓ వ్యక్తి కోసం ఆసక్తిగా వెతికాయి.అతను మరెవ్వరో కాదు నటుడు,నిర్మాత కాంగ్రెస్ పార్టీ లీడర్ బండ్ల గణేష్.ఎన్నికల ముందు ఓ తెగ హడావిడి చేసిన బండ్ల ఎన్నికలు తరువాత కొన్ని మీడియా ఛానెల్స్లో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహకూటమి అధికారంలోకి రాకపోతే గాంధీభవన్ సాక్షిగా నా పీక ఆక్సా బ్లేడ్తో కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాలు తరువాత ఎక్కడ కనిపించలేదు.ఇక ప్రజకూటమి అధికారంలోకి రానున్నట్లు డైలాగ్స్ కొట్టిన నేతలు ఇప్పుడు ఎక్కడా అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఎలక్షన్స్ కి ముందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లెడ్ తో గొంతు కోసుకుంటా అని చెప్పిన బండ్లన్న ఇప్పుడు ఎక్కడా అంటూ అనేక రకాల మేమ్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. తాజాగా బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఓటమిని అంగీకరిస్తున్నాం, గెలిచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు. అంటూ బండ్ల గణేష్ సైలెంట్ గా వివరణ ఇచ్చాడు. ట్విట్ ఓకే మరి పీక ఎప్పుడు కోసుకుంటావ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్లో పెట్టి..
