Friday, May 17, 2024
- Advertisement -

30 కోట్ల న‌ష్టాన్ని ఎవ‌రు భ‌రించాలి..?

- Advertisement -

తెలుగు సినిమాలు హిట్ అయితే ఎంత‌టి కలెక్ష‌న్స్‌ను సృష్టిస్తాయో ప్లాప్ అయితే అంతే న‌ష్టాన్ని మిగుల్చుతాయి.ఈ న‌ష్టానికి తెలుగు టాప్ హీరోలు మ‌హేశ్ బాబు,ప‌వ‌న్ అతీతులు కాదు.వీరు న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌,ఆగ‌డు వంటి సినిమాలు ఎంత‌టి న‌ష్టాల‌ను తెచ్చాయో అంద‌రికి తెలిసిందే.ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది మ‌రో సినిమాకు. నిర్మాత బెల్ల‌కొండ సురేష్ కొడుకు బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైయ్యాడు.క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిరుపించుకోవాల‌ని కెరీర్ మొద‌టి బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ ప్ర‌య‌త్నిస్తునే ఉన్నాడు.

తాజాగా ఆయ‌న న‌టించిన సాక్ష్యం సినిమా గ‌త వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా క‌థ బాగునప్ప‌టికి సినిమాకు స‌రైన టేకింగ్ లేద‌ని,పైగా శ్రీనివాస్ యాక్టింగ్ ఇంకా మెరుగుప‌డ‌ల‌ని ఈ సినిమా చూసిన వారు చెబుతున్నారు.ఈ సినిమాను 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. కాని సినిమా ఫెయిల్ కావ‌డంతో 10 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసింద‌ని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా 30 కోట్ల న‌ష్ట‌న్ని మిగిల్చింద‌ని ,ఈ న‌ష్ట‌న్ని ఎవ‌రు భ‌రించాలి అని ఫైనాన్షియర్లు.. బయ్యర్లు,డిస్ట్రిబ్యుట‌ర్లు వాపోతున్నారు.మినిమ‌మ్ హీరోకు ఉన్న మార్కెట్ కూడా బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్‌కు లేదు.మ‌రి అత‌నిని చూసి ఇంత ఎలా పెట్టార‌ని అంద‌రు ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -