- Advertisement -
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచియమై చాలకాలమైన సరైన హిట్ కోసం ప్రయత్నిస్తునే ఉన్నాడు. బోయపటి శీను వంటి దర్శకుడితో పని చేసిన హిట్ మాత్రం రాలేదు. ఈసారి ఏలాగైనా హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్ర ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లో ఆడియో విడుదల వేడుకను నిర్వహించనున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీవాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.సినిమాలో బెల్లంకొండకు జంటగా పూజా హెగ్డె నటిస్తుంది. సినిమాను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.