Friday, May 3, 2024
- Advertisement -

బెంగాల్ టైగర్ ప్రమోషన్ ఇలా మొదలు పెడతారు

- Advertisement -

కిక్ 2 సినిమాతో ప్రేక్షకులకి విసుగు తెప్పించిన మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు బెంగాల్ టైగర్ సినిమాతో ‘రచ్చ’ చెయ్యడానికి సంపత్ నంది ని వెంటేసుకుని వస్తున్నాడు. ఈ సినిమాతో పక్కగా ప్లాప్ లకి ఫుల్ స్టాప్ పెట్టేసి హిట్ బాట పట్టాలి అని చూస్తున్నాడు రవితేజ.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం సీరియస్ గా సాగుతున్నాయి. డిసెంబర్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల చెయ్యనున్నారు. భీమ్స్ మ్యూజిక్ వారు అందించిన ఆడియో ఫంక్షన్ లేకుండా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆడియో కి ఇప్పుడు ప్లాటినం డిస్క్ వేడుక చేస్తూ సినిమా ప్రమోషన్ ని మొదలు పెట్టబోతున్నారు.

సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -