Tuesday, May 7, 2024
- Advertisement -

గ‌తం నుంచి పాఠం నేర్చిన మ‌హేశ్‌..

- Advertisement -

ఎన్నో అంచ‌నాల‌తో రూపొందిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు కెరీర్‌లోనే అట్ట‌ర్ ఫ్లాప్ సినిమా. ఆ త‌ర్వాత వ‌చ్చిన స్పైడ‌ర్ సినిమా బాగున్నా కొన్ని విష ప్ర‌చారాల వ‌ల‌న ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆ సినిమాలు కొన్ని వారంద‌రూ తీవ్రంగా న‌ష్ట‌పోయారు.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌బాబు న‌టించిన సినిమా భ‌ర‌త్ అను నేను సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ సినిమా హ‌క్కుల‌ను మాత్రం కొంద‌రికే ప‌రిమితం చేశారు. ఆ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరో మ‌హేశ్‌బాబు తీసుకున్నార‌ని స‌మాచారం.

భరత్ అనే నేను సినిమాతో మహేశ్‌బాబు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పాత్ర‌లో మెర‌వ‌నున్నారు. శ్రీమంతుడులాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు కొరటాల శివకు మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుత సినిమా హ‌క్కులు ఇచ్చాడు. సినిమా బాగుంటుంది. ఒక‌వేళ ఏదో విధంగా సినిమా నిరాశ పెడితే ఇత‌రుల‌కు ఇబ్బంది అని భావ‌న‌తో సినిమా హ‌క్కుల‌ను మ‌హేశ్, శివ తీసుకున్నారు.

దర్శకుడు కొర‌టాల శివ నైజాం ఏరియాలోని హ‌క్కుల‌ను సొంతం చేసుకోగా.. హీరో మహేశ్‌బాబు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని హ‌క్కుల‌ను కొనేశాడు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -